ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

ఒకప్పుడు తల్లికొడుకుల బంధం అంటే ఆ ఆప్యాయత, అనురాగం ఎంతో ఉండేవి. కానీ ప్రస్తుతం కొందరు ఈ బంధాన్ని కాలరాస్తున్నారు. చిన్న చిన్న గొడవలకు కోపం, ఆ కోపంలో అనుకోని తప్పులు, లేదా చంపడం వంటివి చాలా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కానీ ఇది మరొక విధమైన సంఘటన.

 

ఎంత కఠినమైన కొడుకు ఉన్నా.. తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. లేదా కొడుకును మార్చుకోవాలి అనుకుంటుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు పిల్లలు వెదవలు అయినా సరే తల్లికి బంగారమే. కానీ ఇక్కడ మాత్రం కొడుకు బాధ బరించలేక ఒక కన్నతల్లి కొడుకును చంపిందట. అది కూడా ప్రియుడితో కలిసి చంపడం బాధాకరం అంటున్నారు నెటిజన్లు. అయితే గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుతోటలో ఉండే జరీనా భేగం మిరపకాయల తొడిమెలు తీసే కూలి పనికి వెళ్తుంటుంది.

ఈమె భర్త కొద్ది కాలం కిందటే చనిపోయారు. అయితే పనికి వెళ్లే ప్లేస్ లో వెంగళాపాయపాలెంకు చెందిన బాజీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందట. ఈ విషయం కొడుకుకు కూడా తెలుసట. తల్లి సంపాదించిన డబ్బులను బాజీకి ఇవ్వడం తట్టుకోలేకపోయేవాడట కుమారుడు.

ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే.. ముగ్గురు కలిసి మద్యం సేవిస్తారట. అయితే ఇదే సందర్భంగా ఒకసారి గొడవ జరగడంతో బాజీతో కలిసి తల్లి కుమారుడిని చంపేసింది. ఈ దాడిలో కుమారుడు అక్కడికి అక్కడే చనిపోయాడు. ఇక పారిపోదాం అనుకున్న ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారట.

Related Posts