సాయి పల్లవి నటించే సినిమాలో యశ్ కూడానా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరాణికాల హవా నడుస్తోంది. ప్రతి డైరెక్టర్ కూడా ఇతిహాస గాధలను తెరకెక్కించి తానేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరికొందరేమో ఇతిహాస వీరుల పేర్లతో మోడర్న్ స్టోరీలు చిత్రీకరించి ఔరా అనిపించాలని చూస్తున్నారు. నితేష్ తివారీ తీయాలనుకుంటున్న నెక్స్ట్ మూవీ ‘రామాయణం’ కూడా ఇలాంటిదే. ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాముడి’గా, అందాల అప్సరస కృతిసనన్ ‘సీత’గా, సైఫ్ అలీఖాన్ ‘రావణాసురుడి’గా తెరకెక్కిన్న ‘ఆదిపురుష్’ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో తెలిసిందే. అయినా కూడా ఈ సినిమాను తెరకెక్కించాలని మళ్లీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాలో మరో సూపర్ కోలీవుడ్ హీరో కూడా కనిపించనున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేజీఎఫ్ ‘ సినిమా సిరీస్ తర్వాత, ఏదైనా పెద్ద సినిమా చేయాలని నిర్ణయించుకున్న యష్ , తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. యష్ 19 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం తెరవెనుక చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే యష్ మరో భారీ సినిమా ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. అవును గత కొన్ని నెలలుగా రామాయణ కథను మళ్లీ సినిమాగా తెరపైకి తీసుకొచ్చే సాహసం చేస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష’పై తీవ్ర విమర్శలు వచ్చినా.. రామాయణాన్ని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఈసారి రణబీర్ కపూర్ రాముడి అవతారంలో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో యష్ రావణుడిగా కనిపించనున్నాడని సమాచారం. గతంలో అద్భుతమైన చిత్రాలను అందించిన బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రామాయణం చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటిస్తాడని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 ప్రారంభంలో ప్రారంభమవుతుంది. జూన్ నెల నాటికి నటుడు యష్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి

రామాయణం సినిమా కోసం నితేష్ తివారీ ప్రముఖ టెక్నీషియన్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. అనేక ఆస్కార్ విన్నింగ్ సినిమాలకు VFX చేసిన వారిని రప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కూడా భారతదేశపు అత్యుత్తమ సాంకేతిక నిపుణులకు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా రామాయణం రెండు భాగాలుగా విడుదల కానుందట. మొదటి భాగంలో యష్‌కు ఎక్కువ సన్నివేశాలు ఉండవు కాబట్టి, యష్ ఈ సినిమా షూటింగ్‌లో కేవలం 15 రోజులు మాత్రమే పాల్గొంటాడని తెలుస్తోంది.. 2024 జూన్ నెలలో యశ్‌ సీన్స్‌ను షూట్‌ చేయనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మధు మంతన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు యశ్‌ తన 19వ సినిమా సన్నాహాలు జోరందుకున్నాయి. ఇటీవల హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ JJ పెర్రీని లండన్‌లో కలుసుకుని మాట్లాడారు యశ్‌. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన లొకేషన్‌ను కూడా యష్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకుడు ఖరారు కాగా త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.

అయితే ‘రామాయణం’ సినిమాను నితీష్ తొలుత రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవితో కాకుండా హృతిక్ రోషన్, దీపిక పదుకొణెతో తెరకెక్కించాలని అనుకున్నారట. అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పి హృతిక్, దీపికతో సంప్రదింపులు కూడా ప్రారంభించేశారు. కానీ అదే ప్రొడక్షన్ బ్యానర్‌పై వస్తున్న మరో సినిమాలో దీపిక ‘ద్రౌపతి’ పాత్రలో నటించనుంది. దాంతో రామాయణంలో సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నారు. ఆ తర్వాత హృతి రోషన్ దగ్గరకు కూడా రాముడి పాత్రకు బదులుగా రావాణాసురుడి పాత్ర వెళ్లింది. కానీ ప్రాజెక్ట్‌లో ఎటువంటి కదలికా రాకపోవడంతో హృతిక్ తన ఇతర సినిమాలపై ఫోకస్ పెట్టేశాడట. చివరకు నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి, రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో నటించబోతున్నారు.

Related Posts